సెన్సెక్స్‌ 500 పాయింట్లు పైకి.

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు త్వరలో ఓ కొలిక్కి రావొచ్చన్న అంచనాలతో 504.86 సెన్సెక్స్, 156.80 నిఫ్టీ పాయింట్లు లాభంతో ముగిసాయి, డాలర్ తో రూపాయి మారకం 92.93 గా ఉంది

 యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్.. ఆర్బీఐ గుడ్‌న్యూస్

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. చదువురాని వారి దగ్గరినుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సైబర్ నేరాల బారినపడుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు పంపినపుడు క్షణాల్లో అవతలి వ్యక్తి అకౌంట్లో డబ్బులు పడిపోతాయి.

Read More  యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్.. ఆర్బీఐ గుడ్‌న్యూస్