ముఖ్య వార్తలు
భారత్‌కి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంతో తెలుసా? వింటే షాక్ అవుతారు!

ప్రస్తుతం దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోవడంతో సామాన్యుడికి వాహనం బయటకు తీయాలన్నా భారంగా మారింది. అయితే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసుకుంటే నిజంగానే ముక్కున వేలేసుకుంటారు. అప్పట్లో లీటరు పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే ఉండేది. అంటే నేటి ఒక రూపాయితో అప్పట్లో దాదాపు 3 నుంచి 4 లీటర్ల వరకు పెట్రోల్ కొనుగోలు చేయగలిగేవారు.

Read More భారత్‌కి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంతో తెలుసా? వింటే షాక్ అవుతారు!
హైదరాబాద్ వాసి అద్భుత ఆవిష్కరణ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజిల్ తయారీ!

రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. పర్యావరణానికి హానికరంగా మారిన ఈ ప్లాస్టిక్ చెత్తను ఉపయోగించి ఇంధనం తయారు చేయడం ఇప్పుడు సాధ్యమైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజనీర్ తన వినూత్న ఆలోచనతో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పెట్రోల్, డీజిల్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Read More హైదరాబాద్ వాసి అద్భుత ఆవిష్కరణ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజిల్ తయారీ!
హార్ముజ్ జలసంధి తిరిగి ప్రారంభం – క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిను ఇరాన్ పూర్తిగా తిరిగి తెరిచినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపింది.

Read More హార్ముజ్ జలసంధి తిరిగి ప్రారంభం – క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం
రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలిక సడలింపు పొడిగింపు

ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన ఆంక్షల సడలింపును అమెరికా మరోసారి పొడిగించింది. ఈ నిర్ణయంతో, ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన రష్యా చమురును అన్ని దేశాలు కొనుగోలు చేసేందుకు తాత్కాలిక అనుమతి కల్పించబడింది.

అమెరికా ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నెల 17 తేదీ లేదా అంతకంటే ముందే నౌకల్లో లోడ్ చేసిన చమురును మాత్రమే కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ సడలింపు వచ్చే నెల 16 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.

Read More రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలిక సడలింపు పొడిగింపు